కృష్ణమ్మకు కలెక్టర్‌ దంపతుల పూజలు

21 Aug, 2016 20:34 IST|Sakshi
కృష్ణమ్మకు కలెక్టర్‌ దంపతుల పూజలు
అమరావతి : కృష్ణానది పుష్కరాల సందర్భంగా పదవ రోజున నదీమతల్లికి కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే దంపతులు ఆదివారం ఉదయం వేకువజామున కృష్ణవేణి మాతకు పూజలు నిర్వహించారు. తొలుత పురోహితులు సంకల్పం చెప్పిన తర్వాత కలెక్టర్‌ దంపతులచే కృష్ణమ్మకు జలతర్పణం వదిలారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్‌ నాసరయ్య తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు