కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు

27 Jan, 2017 02:00 IST|Sakshi

ధర్మవరం అర్బన్ : ధర్మవరం కొత్తపేటలోని పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివే తమ కుమార్తె దాసరి భారతి బుధవారం నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు లక్ష్మీదేవి, ఆంజనేయులు గురువారం తెలిపారు. మూర్ఛ వ్యాధి రావడంతో మూడ్రోజుల నుంచి పాఠశాలకు పంపలేదన్నారు. బుధవారం ఆమెను ఇంట్లోనే వదిలి తాము కూలి పనులకు వెళ్లగా ఆమె కనిపించకుండా వెళ్లిపోయిందన్నారు. అంతటా వెతికినా ప్రయోజనం లేదని వాపోయారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఆచూకీ తెలిసిన వారు ధర్మవరం  ఎస్‌ఐ సెల్‌: 8712925250 నంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు