నిర్విరామంగా శతచండీయాగం

16 Aug, 2016 18:19 IST|Sakshi
వల్లభాపురం (కొల్లిపర): కృష్ణా పుష్కరాల సందర్భంగా మండలంలోని వల్లభాపురం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో నిర్వహిస్తున్న శతచండీయాగం నిర్విరామంగా కొనసాగుతోంది. సకలేశ్వరస్వామి ఆలయం సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిట్లో గణపతిపూజ, ప్రత్యేక వస్త్రాలు ధరించి నిర్వహించిన రుద్రహోమం, మృత్యుంజయహోమం, ప్రదోషకాల అర్చన, కల్యాణోత్సం హోమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు కొత్తూరు వెంకట రమణశాస్త్రి శిష్యబృందం పూజలు చేశారు.
మరిన్ని వార్తలు