భార్య మృతిని తట్టుకోలేక భర్త కన్నుమూత

20 Aug, 2016 17:39 IST|Sakshi

మనూర్ : భార్య మృతిని తట్టుకోలేక మనస్తాపానికి గురైన భర్త అకస్మాత్తుగా కన్నుమూయడంతో వారి నలుగురు పిల్లలు అనాథలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా మనూర్ మండలం కర్సగుర్తి పంచాయతీ పరిధిలోని గంగారం తండాలో శనివారం వెలుగుచూసింది. తండాకు చెందిన మరునిబాయి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో ఆమె భర్త దేవిదాస్(45) గుండెపోటుకు గురై మృతిచెందాడు. తల్లిదండ్రులిద్దరు మృతిచెందడంతో నలుగురు పిల్లలు అనాథలయ్యారు.

మరిన్ని వార్తలు