తిరుమల: శ్రీవారి దర్శనార్థం కాలినడకన వెళుతున్న ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. విజయవాడకు చెందిన రఘు(28) అనే యువకుడు బుధవారం తెల్లవారుజామున కాలినడకన తిరుమల వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.