అర్చకుల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

20 Sep, 2016 20:36 IST|Sakshi
అర్చకుల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

నల్లగొండ కల్చరల్‌ : తెలంగాణ దేవాలయ అర్చక ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అర్చక సంఘం భవనంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దౌలతాబాద్‌ వాసుదేవశర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య గౌరవ అధ్యక్షుడిగా దౌలతాబాద్‌ వాసుదేవశర్మ, నూతన అధ్యక్షుడిగా పోతులపాటి రామలింగేశ్వరశర్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అమరజవాన్లకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారావు, వైదిక బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు గుదె లకీS్ష్మనర్సయ్య, నాగరాజుశర్మ, పులిరామకృష్ణ శర్మ, కోడుగంటి వెంకటరమణశాస్త్రీ, నందిభట్ల నాగరాజు శర్మ, విశాలక్ష్మమ్మ, శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు