రేపు కాకినాడలో జిల్లా స్థాయి విలువిద్య ఎంపికలు

1 Feb, 2017 00:23 IST|Sakshi
మామిడికుదురు : 
కాకినాడ డీఎస్‌ఏ స్టేడియంలో గురువారం జిల్లా స్థాయి విలువిద్య ఎంపిక జరగుతాయని జిల్లా ఆర్చరీ అసోసియేష¯ŒS అధ్యక్షుడు జేఎ¯ŒSఎస్‌ గోపాలకృష్ణ మంగళవారం తెలిపారు. ఉదయం పది గంటలకు జరిగే సెలక్షన్లకు నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో అభ్యర్థులు హాజరుకావాలన్నారు. గ్రామ కార్యదర్శి, మున్సిపల్‌ అధికారులు జారీ చేసిన జనన ధ్రువపత్రం తీసుకురావాలన్నారు. 1996 జనవరి ఒకటో తేదీ తరువాత పుట్టిన వారు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని చెప్పారు. ఇండియ¯ŒS రౌండ్స్, రికర్వ్, కాంపౌండ్‌ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. జిల్లా స్థాయి సెలక్ష¯Œ్సలో ఎంపికైన వారు ఫిబ్రవరి 9,10 తేదీల్లో కడప జిల్లా పొద్దుటూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం సెల్‌ నెంబర్లు 9491575616, 9396265791కు సంప్రదించాలన్నారు.         
 
మరిన్ని వార్తలు