దత్తాయపల్లిలో డీఎల్‌పీఓ విచారణ

26 Jul, 2016 01:20 IST|Sakshi
దత్తాయపల్లిలో డీఎల్‌పీఓ విచారణ
తుర్కపల్లి : మండలంలోని దత్తాయపల్లి గ్రామపంచాయితీ సర్పంచ్‌ ధ్యానబోయిన సరిత నిధులు దుర్వినియోగం చేశారని ఉపసర్పంచ్‌ ఎరకల వెంకటేశ్‌గౌడ్‌ కలెక్టర్‌ సత్యనారాయణరెడ్డికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డీఎల్‌పీఓ సత్యనారాయణరెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా ఇరుపక్షాల నుంచి రాత పూర్వకంగా వాగ్ములాలను స్వీకరించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ధ్యానబోయిన సరిత, ఈఓపీఆర్‌డీ చంద్రమౌళి, వార్డుసభ్యులు, కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు