అట్రాసిటీ కేసులపై విచారణ

27 Jul, 2016 23:24 IST|Sakshi
తడ: ఇటీవల కాలంలో తడ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు అట్రాసిటీ కేసులకు సంబంధించి బుధవారం ఆ విభాగం డీఎస్పీ సుధాకర్‌ విచారణ చేపట్టారు. అండగుండాల గ్రామ దళితులకు సంబంధించిన స్మశాన స్థలాన్ని చేనిగుంటకు చెందిన రైతు శ్రీనివాసులురెడ్డి ఆక్రమించే ప్రయత్నం చేశాడని కేసు నమోదు అయింది. ఈ కేసుతో పాటు తడకు చెందిన ఓ గిరిజన యువతిని తిరుపతికి చెందిన వ్యక్తి మోసం చేశాడనే ఫిర్యాదుపైనా విచారణ జరిపారు. అండగుండాలలో పొలాన్ని పరిశీలించిన అనంతరం తడలోని పున్నమి అతిథిగహంలో బాధితుల నుంచి వివరాలు సేకరించారు.  
>
మరిన్ని వార్తలు