-

ఇంటర్‌ ప్రవేశానికి 15న తుది గడువు

8 May, 2017 23:52 IST|Sakshi

అనంతపురం రూరల్‌ :   జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాలలు, కళాశాలల జిల్లా కోఆర్డినేటర్‌ ఉషారాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను www.apswreis.inలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలు, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన మార్కుల జాబితాను జత చేసి దగ్గరలోని గురుకుల కళాశాలలో ఈనెల 15లోపు అందజేయాలన్నారు.

 

మరిన్ని వార్తలు