కోవెలకుంట్ల: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్లో శనివారం పొగతాగుతున్న ఐదుగురికి రూ. 500 జరిమానా విధించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. అలాగే స్థానిక జమ్మలమగుడు చౌరస్తాలో వాహనాల తనిఖీ నిర్వహించి ఆర్సీ, లైసెన్స్, హెల్మెట్లేని 22 మంది వాహన చోదకులకు రూ. 2400 జరిమానా వేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.