-
ప్రకాశం జిల్లాలో అత్యధికం.. వైఎస్సార్ జిల్లాలో అత్యల్పం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో 15 ఏళ్లు పైబడిన వారిలో 22.6 శాతం మంది పొగరాయుళ్లేనని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ఇక 15 ఏళ్లు దాటిన మహిళల్లో 3.8 శాతం మందికి ధూమపానం అలవాటు ఉన్నట్లు సర్వే పేర్కొంది. పురుషుల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 28.2 శాతం మంది పొగ తాగుతుండగా అత్యల్పంగా వైఎస్సార్ కడప జిల్లాలో 18 శాతం మందికి ఈ వ్యసనం ఉంది. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది పొగతాగుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో 15.8 శాతం పురుషులు పొగతాగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో 25.6 శాతం మంది పొగ తాగుతున్నారు. మహిళల్లో 1.9 శాతం మంది పట్టణాల్లో, 4.7 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో పొగ పీలుస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మహిళలు ఎక్కువగా పొగ తాగుతున్నట్లు సర్వే పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికం.. దేశంలో అత్యధికంగా ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలు, పురుషులు పొగతాగుతున్నట్లు తేలింది. మిజోరాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లో అత్యధికంగా మహిళలు, పురుషులు పొగతాగుతున్నట్లు సర్వే తెలిపింది. తెలంగాణలో 22.3 శాతం పురుషులు, 5.6 శాతం మంది మహిళలు పొగతాగుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పోల్చితే అత్యధికంగా బిహార్లో 48.8 శాతం, గుజరాత్లో 41.1 శాతం, మహారాష్ట్రలో 33.8 శాతం మంది పురుషులు పొగతాగుతున్నట్లు సర్వే పేర్కొంది. -
పొగ తాగే వారికి ఈ సమస్యలు తప్పవు ..!
కొంతమంది చాలా సుదీర్ఘకాలం నుంచి పొగతాగుతూ ఉంటారు. ఇలాంటివారిని ‘క్రానిక్ స్మోకర్స్’ అని వ్యవహరిస్తుంటారు. ఇలాంటి వాళ్లలో కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు కనిపిస్తుంటాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి ఎందుకు, ఎలా వస్తాయో చూద్దాం. కార్నియా పైపొరను ఎపిథీలియమ్ అంటారు. స్మోకింగ్ కోసం తరచూ లైటర్ లేదా అగ్గిపుల్ల ఉపయోగించి, ఆ మంటను నోటి దగ్గరికి తీసుకెళ్లినప్పుడల్లా అది కంటికీ ఎంతో కొంత తాకే అవకాశం ఉంది. అలా మాటిమాటికీ ఆ పొగ, సెగ తగలడం వల్ల ఈ ఎపిథీలియమ్ దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఒకవేళ అది దెబ్బతింటే కంట్లోంచి నీరు కారడం, ఎరుపెక్కడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా ఎక్కువగా పొగతాగేవాళ్ల (క్రానిక్ స్మోకర్స్)లో నికోటిన్ విష పదార్థం ప్రభావంవల్ల ‘టుబాకో ఆంబ్లోపియా’ అనే సమస్య కూడా వస్తుంది. ఆంబ్లోపియా వచ్చిన వాళ్లలో కంటి నరం (ఆప్టిక్ నర్వ్) దెబ్బతిని స్పష్టమైన బొమ్మ (క్లియర్ ఇమేజ్) కనిపించకుండా కేవలం ఓ స్కెచ్లాగానో, నెగెటివ్ లాగానో (ఘోస్ట్ ఇమేజ్) కనిపిస్తుంది. మీరు వెంటనే సిగరెట్ మానేయండి. ఆంబ్లోపియా వచ్చినవాళ్లు వెంటనే సిగరెట్ పూర్తిగా మానేయాలి. ఆ తరవాత వాళ్లకు విటమిన్ సప్లిమెంట్స్ (ప్రత్యేకంగా బి1, బి2, బి12, బి6) ఇస్తే పరిస్థితి నార్మల్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఇలా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మన చూపును పోగొట్టి దృష్టిదోషాలు తెచ్చే పొగతాగే అలవాటును తక్షణం మానేయడం చాలా మంచిది. చదవండి: తెమడ రంగును బట్టి జబ్బును ఊహించవచ్చు! -
పొగరాయుళ్లకు పొగపెట్టారు
సాక్షి,న్యూఢిల్లీ: పొగతాగే అలవాటుకు పొగపెట్టేందుకు జపాన్లోని ఓ మార్కెటింగ్ కంపెనీ వినూత్న ఒరవడిని అనుసరించింది. తమ సంస్థలో పొగతాగని ఉద్యోగులకు ఏడాదిలో అదనంగా ఆరు రోజుల హాలిడేను ప్రకటించింది. పొగరాయుళ్లలాగా సిగరెట్ తాగేందుకు తరచూ బ్రేకులు తీసుకోకుండా బుద్ధిగా పనిచేసుకునే వారికి ఈ నజరానా ప్రకటించింది. పొగతాగే కొలీగ్ల కంటే తాము అధికం సమయం పనిచేస్తున్నామని నాన్ స్మోకర్లు ఫిర్యాదు చేయడంతో వారికి వేతనంతో కూడిన అదనపు సెలవును పియాలా ఇంక్ అనే మార్కెటింగ్ కంపెనీ ప్రకటించింది. పొగతాగే అలవాటును మానివేసేందుకు తాము ప్రకటించిన ఇన్సెంటివ్ ఉపకరిస్తుందని కంపెనీ సీఈవో ఆశాభావం వ్యక్తం చేశారు. పొగతాగే అలవాటును మాన్పించేందుకు, పొగతాగేవారికి వ్యతిరేకంగా కఠిన నిబంధనలను జపాన్ ఇటీవల ప్రవేశపెట్టింది. 2020 వేసవి ఒలింపిక్ల నేపథ్యంలో జపాన్ నగరాలను స్మోక్ ఫ్రీ సిటీస్గా మార్చాలని అధికార యంత్రాగం భావిస్తోంది. టోక్యో గవర్నర్ యురికో కొయికె ఈ దిశగా ఇటీవల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. -
ఇంట్లో సిగరెట్ కాలిస్తే కష్టమే!
వాషింగ్టన్ : తల్లిదండ్రులు ఇంట్లో పొగతాగడం వల్ల పిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. పాసివ్ స్మోకింగ్ వల్ల చిన్నారుల చేతులుపై, లాలాజలంలో కేన్సర్ కారక నికోటిన్ అవశేషాలు చేరుతున్నాయని వారు పేర్కొన్నారు. సిన్సినాటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెడికల్ కేర్ సెంటర్లో 700 మంది చిన్నారుల సమాచారాన్ని శాస్త్రవేత్తలు సేకరించారు. వీరిలో ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతున్న 25 మంది చిన్నారుల డేటాను విశ్లేషించారు. ఈ చిన్నారులందరి సగటు వయస్సు అయిదు సంవత్సరాలు. వీరిని పరిశీలించిన శాస్త్రవేత్తలు వీరి శరీరంపైనా, లాలాజలంలో కేన్సర్ కారక నికోటిన్ ఉందని కనుగొన్నారు. ఈ చిన్నారుల తల్లిదండ్రులందరూ పొగతాగేవారేనని వారు తెలిపారు. -
పొగరాయుళ్ల నుంచి రూ.1.7 కోట్లు వసూలు
బెంగళూరు : బహిరంగ ప్రదేశాల్లో పొగతాగుట నిషేధం. బస్సులో పొగ తాగరాదు అంటూ ప్రతి ఆర్టీసీ బస్సులో దర్శనమిస్తూనే ఉంటాయి. అయినా నిబంధనలు అతిక్రమిస్తూనే ఉంటారు. నిబంధనలు అతిక్రమించి పబ్లిక్ ప్రాంతమైన బస్సు స్టేషన్లలో స్మోకింగ్ చేసిన వారికి జరిమానా విధించేలా కర్ణాటక రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ) చేపట్టిన యాంటీ-స్మోకింగ్ డ్రైవ్కు అనూహ్య స్పందన వచ్చింది. జరిమానా కింద మొత్తం రూ.1.7 కోట్లను కేఎస్ఆర్టీసీ వసూలు చేసింది. 2013 నుంచి ఇప్పటివరకు 85,143 మంది ప్రయాణికులపై కేఎస్ఆర్టీసీ జరిమానా విధించింది. 2013-14 నుంచి 2014-15కు బస్సులో పొగతాగే వారి సంఖ్య పెరిగినా.. ఈ జరిమానాలతో 2015-16కు స్మోకింగ్ చేసే వారి తగ్గినట్టు కేఎస్ఆర్టీసీ పేర్కొంది. సిగరేట్స్, ఇతర పొగాకు ఉత్పత్తుల యాక్ట్ 2003 కింద బస్సు స్టేషన్లో స్మోకింగ్ చేస్తూ పట్టుబడిన వారికి కేఎస్ఆర్టీసీ రూ.200 జరిమానా విధిస్తోంది. దీంతో ఈ ప్రజారవాణా సంస్థకు ఊహించకుండానే రూ.1.70 కోట్ల ఆర్థిక సాయం అందింది. రాష్ట్రవ్యాప్తంగా 150 కేఎస్ఆర్టీసీ బస్సు స్టేషన్లలో ప్రయాణికులు స్మోకింగ్ చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ డ్రైవ్ కేవలం రెవెన్యూలు ఆర్జించడమే కాకుండా, ప్రజల్లో స్మోకింగ్ వల్ల కలిగే ఆరోగ్యసమస్యలపై అవగాహన తెప్పిస్తున్నామన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
Advertisement