ఆటోకు నిప్పు

5 Feb, 2017 23:14 IST|Sakshi

ధర్మవరం టౌన్ : పట్టణంలోని సత్యసాయినగర్‌లో ఓ ఆటోకు ప్రకాష్‌ అనే వ్యక్తి నిప్పు పెట్టాడు. బాధితుడు హరి తెలిపిన మేరకు.. శివరాం నగర్‌లో నివాసం ఉంటున్న హరి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తన మిత్రులు ప్రకాష్, వినోద్‌లు గొడవపడుతుంటే జోక్యం చేసుకుని ఇద్దరినీ దండించాడు. తనను దండించడానికి నీవెవరు.. నీ అంతు చూస్తా అంటూ హరిని ప్రకాష్‌ బెదిరించాడు.

ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటి ముందు నిలిపి ఉంచిన ఆటోను ప్రకాష్‌ సత్యసాయినగర్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నిప్పు పెట్టారు. ఆటో పూర్తిగా కాలిపోయింది. రూ.1.50 లక్షల వరకు నష్టం జరిగిందని, నిందితుడు ప్రకాష్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు హరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు