సింగూరుకు పోటెత్తుతున్న వరద..

26 Sep, 2016 09:08 IST|Sakshi

సందర్శకులకు ప్రవేశం నిషేధం
మెదక్

 జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద పొటెత్తుతోంది. వరద ఉధృతి దృష్ట్యా ప్రాజెక్టుకు సందర్శకులకు ప్రవేశం నిషేధిస్తున్నట్లు జల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ ప్రకటించారు. మూడు రోజుల పాటు సందర్శకులను అనుమతించమని ఆయన తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1,717.93 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,716.45 అడుగుల వరకు నీరు చేరింది. ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 84 వేల క్యూసెక్కులు ఉంది.

 

>
మరిన్ని వార్తలు