చిత్తూరు జిల్లాలో విషాదం..

13 Feb, 2016 16:21 IST|Sakshi

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. చెన్నమ్మగుడిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి నలుగురు బాలికలు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు బాలికలను ఓ మహిళ కాపాడింది. గల్లంతైన మరో బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు