విశాఖపట్నం: విశాఖపట్నంలో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బాజి జంక్షన్, గోపాలపట్నం, వేపగుంట, సిహచలం ప్రాంతాల్లో రోడ్ల పైకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి.