గండికి భారీ ఆదాయం

31 Aug, 2016 19:19 IST|Sakshi
గండికి భారీ ఆదాయం

చక్రాయపేట :
జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి వీరాంజనేయస్వామి ఆలయ హుండీని బుధవారం లెక్కించారు.  ఆలయ సహాయ కమిషనర్‌ పట్టెం గురుప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన హుండీ లెక్కింపులో రూ. 25, 21, 685లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రావణ మాసం కావడంతో ఈ నెలలో భారీ సంఖ్యలో భక్తులు అంజన్నను దర్శించుకున్నారు. హుండీలో నగదుతోపాటు  60గ్రాముల బంగారం, 1.872గ్రాముల వెండి, 26 అమెరికా డాలర్లు, 12సింగపూర్‌ డాలర్లు, పదిజర అరబిక్‌ హంసలు, 31కువైట్‌ డాలర్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మెన్‌ రాజారావుతోపాటు పాలకమండలి సభ్యులు, బ్యాంకు సిబ్బంది, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు