గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయంలో మంగళవారం వైఎస్సార్ సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి అభిమానులు, పార్టీ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లాలో పాయకరావుపేట నియోజకవర్గం పాల్మన్పేటలో ఇటీవల దాడికి గురయిన బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఆయన మంగళవారం ఉదయం హైదరాబాదుకి తిరుగు ముఖంపట్టారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాద్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావు, నియోజకవర్గ సమన్వకర్తలు కోలాగురువులు, అన్నంరెడ్డి అదీప్రాజ్, నగరమహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్, రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, జిల్లా అధికారప్రతినిధి ఆల్ఫాకష్ణ, మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్, గాజువాక మాజీ కౌన్సిలర్ పల్లా చినతల్లి, ఆమె భర్త పెంటారావు, రాష్ట్రయువజన అధికారప్రతినిధి తుల్లి చంద్రశేఖర్ యాదవ్, నగర కార్యదర్శి ఆళ్ల పైడిరాజు, నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు షరీఫ్ తదితర నాయకులు జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా సాగనంపారు.