- వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
కర్నూలు(ఓల్డ్సిటీ):
ఆర్టీసీ ఎన్నికల్లో కర్నూలు 1, 2 డిపోల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులను గెలిపించి ఆ విజయాలను జగన్కు కానుకగా ఇద్దామని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ట్రేడ్ యూనియన్ నాయకులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్టీసీలో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ ఆర్టీసీ తరపున ప్రతినిధులను ఎంపిక చేశారు. డిపో-1కు ఎం.బి.ఎల్.శాస్త్రి, డిపో-2కు జి.సెబాస్టిన్ను పోటీకి ప్రకటించారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులు యూనియన్లకు అతీతంగా స్పందించి, వీరి గెలుపునకు సహకరించాలని విజ్ఙప్తి చేశారు. అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మాట ఇచ్చారని, వైఎస్ఆర్ ఆర్టీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మాధవనగర్లోని ఆయన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, ట్రేడ్యూనియన్ జిల్లా, నగర అధ్యక్షులు టి.వి.రమణ, కటారి సురేశ్కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్దన్రెడ్డి, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం.వి.కుమార్, కర్నూలు డిపో-2 కార్యదర్శి పి.నాగన్న, ట్రేడ్యూనియన్ నాయకులు సూరి, ఏసు, రాజు తదితరులు పాల్గొన్నారు.