చిన్నారి అదృశ్యం

27 Aug, 2016 00:11 IST|Sakshi
చిన్నారి రాధ

సాక్షి, తిరుమల : తిరుమలలో భవన నిర్మాణ పనులు చేసుకుంటున్న కర్ణాటకకు చెందిన దేవరాజులు కుమార్తె కె.రాధ(4) బుధవారం తప్పిపోయింది. మూడేళ్లుగా వారు ఇక్కడ ఉంటున్నారు. స్థానిక సీనియర్‌ సిటిజన్‌ క్యూ వద్ద ఆ చిన్నారి తప్పిపోయింది. రెండురోజులుగా గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు