సందడిగా కార్తీక వన భోజనాలు

27 Nov, 2016 21:58 IST|Sakshi

అనంతపురం కల్చరల్‌ : నగరంలోని హెచ్చెల్సీకాలనీలోని రామకృష్ణ సేవా సమితి కార్యాలయ ఆవరణంలో  ఆదివారం వనభోజనాల సందడి సాగింది.  సమితి అధ్యక్షుడు శ్రీధరమూర్తి  నేతృత్వంలో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ  సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి.

ఈ సందర్భంగా సంధ్యామూర్తి, నాగస్వరూప్‌ ప్రసాద్‌  బృందాలు ఆలపించిన రామకృష్ణ ఆధ్యాత్మిక గీతాలు భక్తిభావాన్ని పెంచాయి. అనంతరం వందలాది మంది భక్తులు తీర్థ ప్రసాదాలతో పాటు  వనభోజనాలారగించారు. అలాగే కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోపా మచ్చా నరసింహులు ఆధ్వర్యంలో దాదాపు 14 బస్సులలో ఆర్యవైశ్యులు కోటంక క్షేత్రానికి వనభోజనాలకు తరలి వెళ్లారు.

మరిన్ని వార్తలు