ఆల్‌ ఇండియా బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు కోడూరు విద్యార్థి

12 Dec, 2016 23:43 IST|Sakshi

రైల్వేకోడూరు రూరల్‌: ఆల్‌ ఇండియా బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు తమ కళాశాల విద్యార్థి నవీన్‌ ఎంపికైనట్లు శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, యోగి వేమన యూనివర్సిటీ పాలక మండలి సభ్యుడు ముత్యాల పెంచలయ్య తెలిపారు. యోగి వేమన యూనివర్సిటీలో ఈ నెల 10న నిర్వహించిన ఎంపికలో నవీన్‌ ప్రతిభ కనబరిచి ఆల్‌ ఇండియా బాల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 28 నుంచి 31వతేదీ వరకు చెన్నైలో జరిగే ఆల్‌ ఇండియా పోటీలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా కోచ్‌ పుల్లారావును, నవీన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.


 

మరిన్ని వార్తలు