పూర్తి ఆధిక్యంలో ముంబయి జట్టు

12 Nov, 2016 21:44 IST|Sakshi
పూర్తి ఆధిక్యంలో ముంబయి జట్టు

గుంటూరు స్పోర్ట్స్‌ : పేరేచర్లలోని ఏసీఏ, నరేంద్రనాథ్‌ క్రికెట్‌ గ్రౌండ్స్‌లో జరుగుతున్న డి.వి.సుబ్బారావు మెమోరియల్‌ టోర్నమెంట్‌లోని మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతునాయి. శుక్రవారం అట ముగిసే సమయానికి ముంబయి జట్టు 248 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. శనివారం తొలి ఇన్నింగ్‌ ప్రారంభించిన కర్నాటక జట్టు 32 ఓవర్లలో కేవలం 52 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది.  అనంతరం రెండో ఇన్నింగ్‌ ప్రారంభించిన ముంబయి జట్టు రెండో రోజు అట ముగిసే సమయానికి 58 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
 

మరిన్ని వార్తలు