500 లీటర్ల సారా ఊట ధ్వంసం

17 May, 2016 11:59 IST|Sakshi

వైఎస్సార్ జిల్లా: సుండుపల్లి మండలంలోని మడితాడు పంచాయతీ సుంకరవాండ్లపల్లి సమీపంలో నిల్వ ఉంచిన 500 లీటర్ల సారా ఊటను ఎక్సైజ్ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. సారా తయారీకి ఉపయోగించే డ్రమ్ములను, బట్టీలను ధ్వంసం చేశారు. కార్యక్రమంలో రాయచోటి ఎక్సైజ్ సీఐ మురళీకిషోర్, కడప ఎన్‌పోర్స్‌మెంట్ సీఐ గణేష్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు