వ్యక్తి అనుమానాస్పద మృతి

12 Sep, 2016 01:11 IST|Sakshi
  • పర్ధీపురంలో ఘటన
  • 5రోజుల తర్వాత వెలుగులోకి..
  • ఎటో వెళ్లిపోయిన భార్యాపిల్లలు
  • చిన్నచింతకుంట : ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. చిన్నచింతకుంట మండలలోని పర్ధీపురానికి చెందిన కుర్వ తిరుపతయ్య (35) వత్తిరీత్యా గొర్రెలకాపరి. ఈయనకు ఆత్మకూర్‌కు చెందిన సుజాతలో సుమారు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఈనెల 6న కుటుంబ విషయమై భార్యాభర్తలు గొడవపడ్డారు. ఆరోజు నుంచి అతను కనిపించకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కలవారు భార్యను రెండు రోజుల క్రితం అడిగితే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు వెళ్లాడని తెలిపింది. ఈక్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున ఇంటికి తాళం వేసి పిల్లలను తీసుకుని ఆమె ఎటో వెళ్లిపోయింది. మధ్యాహ్నం అందులోనుంచి దుర్వాసన రావడంతో గ్రామస్తులు తాళాలు పగులగొట్టి తలుపులు తీసి చూసేసరికి లోపల గదిలో తిరుపతయ్య మతదేహం కనిపించింది. అతడిని భార్యనే హతమార్చి ఉంటుందని బంధువులు ఆరోపిస్తున్నారు. అక్కడి ఆనవాళ్లను బట్టి ఐదు రోజుల క్రితమే ఈ సంఘటన చోటు చేసుకుని ఉండవచ్చని వారు చెబుతున్నారు. ఈ విషయమై మతుడి తండ్రి రెడ్డప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సంఘటన స్థలాన్ని ఆత్మకూర్‌ సీఐ ప్రభాకర్‌రెడ్డి, చిన్నచింతకుంట ఏఎస్‌ఐ భీమయ్య పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
     
     
     
మరిన్ని వార్తలు