కరెంటు షాక్‌తో యువకుడి మృతి

4 Jun, 2016 15:18 IST|Sakshi

మాలియల్ : కరీంనగర్ జిల్లా మాలియల్ మండలం నూకపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామశివారులో ఉన్న ఓ వ్యవసాయ బావి వద్ద కూలీ పనులు చేస్తుండగా చిన్ను(23) అనే యువకుడు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు