వ్యక్తి ఆత్మహత్య

6 Oct, 2016 22:06 IST|Sakshi
కనగల్‌
అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వ్యక్తి మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం లచ్చుగూడెం పరిధి కుమ్మరిగూడెంలో జరిగింది. కనగల్‌ ఎస్సై డి.నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సత్యమయ్య(55) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. తీవ్రంగా కడుపునొప్పి రావడంతో బాధ భరించలేక జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురగులమందు తాగాడు. ఇంటి పక్కల వారు గమనించి వ్యవసాయ భూమిలో పనులకు వెళ్లిన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు వచ్చి బాధితుడిని చికిత్స నిమిత్తం 108లో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సత్యమయ్య మృతి చెందాడు. మృతుడి కుమారుడు నరేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.  
 
>
మరిన్ని వార్తలు