రాజన్నను దర్శించుకున్న చందులాల్

25 Jun, 2016 12:29 IST|Sakshi
రాజన్నను దర్శించుకున్న చందులాల్

కరీంనగర్: వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రి చందులాల్ శనివారం దర్శించుకున్నారు.

సతీసమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజ ఏర్పాట్లను చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. త్వరలోనే ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చుదిద్దుతామని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు