దంతాలపల్లిని మండలంగా ప్రకటించాలి

29 Sep, 2016 00:43 IST|Sakshi
దంతాలపల్లిని మండలంగా ప్రకటించాలి
నర్సింహులపేట : దంతాలపల్లిని మం డలంగా ప్రకటించాలని డిమాండ్‌ చే స్తూ బుధవారం స్థానికులు చెరువులో మునుగుతూ నిరసన తెలిపారు. అనంతరం దంతాలపల్లి అంబేద్కర్‌ సెంటర్‌ వరంగల్‌–ఖమ్మం హైవేపై రాస్తారోకో చేశారు. మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నాయిని రఘునందన్‌ రెడ్డి, సర్పంచ్‌ కిషన్‌ నాయక్, ఎంపీటీసీ కిశోర్‌కుమార్, మాజీ సర్పంచ్‌ నాయిని శ్రీనివాస్‌రెడ్డి, జేఏసీ కన్వీనర్‌ ధర్మారపు వెంకన్న, బీజేపీ నియోజకవర్గ నాయకుడు చీకటి మహేష్, మండల సాధన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు