హుజురాబాద్‌ తరలిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులు

30 Jul, 2016 17:31 IST|Sakshi
జమ్మికుంట రూరల్‌ : ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో చేపట్టిన చలో క్యాంపన్‌ యాత్ర శనివారం హుజురాబాద్‌కు చేరుకోగా జమ్మికుంట నాయకుడు మహ్మద్‌ ఇమ్రాన్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీగా  తరలివెళ్లారు. రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తరలివెళ్లిన వారిలో నాయకులు శ్యాం, సర్వర్, ఫయాజ్, శివ, సన్ని, పరశురామ్, సాయికృష్ణ, రమేశ్‌ తదితరులున్నారు.
మరిన్ని వార్తలు