సుల్తానాబాద్: మండల కేంద్రంలోని శ్రీరాంపూర్ కూడలి వద్ద ఆటోలో తరలిస్తున్న రేషన్బియ్యాన్ని శనివారం వాహనాల తనీఖీలో పట్టుకున్నట్లు ఎస్సై జీవన్ తెలిపారు. సుల్తానాబాద్ మార్కండేయ కాలనీకి చెందిన బండారి వంశి అనే వ్యక్తి ఏడు క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకుని ఆటోను సీజ్చేసి స్టేషన్కు తరలించినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి బియ్యాన్ని పంచనామా కోసం డీటీసీఎస్ అధికారులకు సిఫార్సు చేశామన్నారు.