రాప్తాడు ధర్నాకు పోలీసులు నో

17 May, 2016 09:35 IST|Sakshi

రాప్తాడు(అనంతపురం): కర్నూలులో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న జలదీక్షకు మద్దతుగా రాప్తాడు మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం పది మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నా నిర్వహిస్తుండగా రాప్తాడులో మాత్రం పోలీసులు అనుమతించక పోవడంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు