16 నుంచి వ్యవసాయ పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌

8 Aug, 2016 23:55 IST|Sakshi
జగిత్యాల అగ్రికల్చర్‌ : రెండేళ్ల వ్యవసాయ, సీడ్‌ టెక్నాలజీ, మూడేళ్ల వ్యవసాయ ఇంజనీరింగ్‌ డిప్లొమా పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 16 నుంచి 21 రాజేంద్రనగర్‌ వ్యవసాయ యూనివర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని, సీటు కేటాయించిన వెంటనే ఫీజు చెల్లించాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎస్‌. సుధీర్‌కుమార్, పొలాస పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌∙తెలిపారు. 
మరిన్ని వార్తలు