180 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

15 Dec, 2016 10:06 IST|Sakshi

కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లాయగూడెంలో పౌరసరఫరాల శాఖాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నాయనే సమాచారంతో దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు