ఆర్‌బీఎస్‌కే రాష్ట్ర నూతన కార్యవర్గం

12 Sep, 2016 00:23 IST|Sakshi
పోచమ్మమైదాన్‌ : రాషీ్ట్రయ బాల స్వస్తీయా కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. వరంగల్‌లోని అనంతలక్ష్మీ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో రాష్రీ్టయ బాల స్వస్తీయ కార్యక్రమ వైద్యుల సమావేశం ఆదివారం జరిగింది. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్‌ వలుబోజు మోహన్‌రావు, అధ్యక్షుడిగా డాక్టర్‌ గుండా రవీందర్, ఉపాధ్యక్షులుగా రమేష్, చం ద్రశేఖర్, హుస్సేన్, కార్యదర్శిగా కుమార్, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా రవికుమార్, కోశాధికారిగా మాధవి, సహాయ కార్యదర్శిగా మిసియెుద్దీన్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. 
>
మరిన్ని వార్తలు