15 సూత్రాల కార్యక్రమం పై సమీక్ష

12 Dec, 2016 14:48 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించి ప్రధాన మంత్రి 15 సూత్రాల కార్యక్రమం జిల్లాలో సంపూర్ణ స్థాయిలో అమలు కావాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో 15 సూత్రాల కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ కార్యక్రమంపై ప్రతి అధికారి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మైనార్టీ రుణాలు గత ఏడాదిలో 100 యూనిట్ల ఇవ్వగా ఈ ఏడాది 40 మాత్రమే ఇచ్చారని ఈ సంఖ్య పెంచాలని 15 సూత్రాల సభ్యుడు ఈటెస్వామిదాస్‌ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు