'పదవులు అమ్ముకుంటున్న గంజి చిరంజీవి'

7 Jan, 2016 19:13 IST|Sakshi
'పదవులు అమ్ముకుంటున్న గంజి చిరంజీవి'

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీలో వర్గపోరు ముదురుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీలో వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. నియోజకవర్గ ఇన్ చార్జి గంజి చిరంజీవి తీరుపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ పదవులను చిరంజీవి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చిరంజీవి వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ బాలాజీ తెలిపారు.

మరిన్ని వార్తలు