శిథిల భవనం కూలి ఇద్దరికి గాయాలు

13 Sep, 2016 18:34 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పట్టణంలో వర్షాల ధాటికి ఒక భవనం కూలిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో ఓ పాత భవనం వర్షాలకు నాని మంగళవారం మధ్యాహ్నం కూలింది. ఆ భవనంలో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పినట్లయింది.అయితే, అదే సమయంలో అటుగా వెళ్తున్న రాకేష్, మంజుల దంపతులు స్వల్పంగా గాయపడ్డారు.

 

మరిన్ని వార్తలు