మొక్కలు నాటి సంరక్షించాలి

28 Jul, 2016 23:49 IST|Sakshi
పాన్‌గల్‌: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని గ్రామాణాభివృద్ధి, పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండా,  కేతేపల్లి, గోపల్‌దిన్నె గ్రామాలల్లో నిర్వహించిన హరితహారంలో ఆయన పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి అవరణలు, పొలం గట్లు, కాల్వల పరిసరాలల్లో మొక్కలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. ఆయా గ్రామాలకు కేటాయించిన టార్గెట్‌లను పూర్తి చేయాలని దీంతో పాటు అధిక సంఖ్యలో మొక్కలు నాటి వాటిని కాపాడిన గ్రామాలకు అభివృద్ధి పనులకు నిధులతో పాటు తగిన పారితోషకం అందిస్తామన్నారు. నాటిన మొక్కలు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి కాపాడాలన్నారు. 
 
 
 
 
మరిన్ని వార్తలు