'గ్లోబల్ టెండర్ల ద్వారా సీడ్ క్యాపిటల్ నిర్మాణం'

16 Jan, 2016 19:26 IST|Sakshi

విజయవాడ : గ్లోబల్ టెండర్ల ద్వారా సీడ్ క్యాపిటల్ నిర్మాణం చేపడతామని ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. శనివారం విజయవాడలో పి.నారాయణ మాట్లాడుతూ... సీడ్ క్యాపిటల్ ప్రాంతంలోని మూడు గ్రామాల రైతులకు ఆయా గ్రామాల పరిధిలో భూములిచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.  మరోసారి ల్యాండ్ పూలింగ్ అభ్యంతరాలపై ఫిబ్రవరి1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. గ్రామాల నుంచి అభ్యంతరాలు వస్తే.. రోడ్లను బైపాస్ చేస్తామని నారాయణ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు