-
ప్రభుత్వ భూములూ మింగేశారు!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు అమరావతిలో సాగించిన భూదోపిడీలో తవ్వుతున్న కొద్దీ కొత్త అక్రమాలు గుట్టలు గుట్టలుగా బయట పడుతున్నాయి. అసైన్డ్ భూములే కాకుండా ప్రభుత్వ భూములనూ వదల్లేదు. చంద్రబాబు, పి.నారాయణ, లోకేశ్ త్రయం బినామీల పేరిట కొల్లగొట్టిన భూముల జాబితా చాంతాడులా సాగుతోంది. అసైన్డ్ రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే వారి భూములను రాజధాని కోసం టీడీపీ సర్కారు తీసుకుంటుందని బెదిరించి రూ.3,370 కోట్ల విలువైన 617 ఎకరాలను కొల్లగొట్టిన కుంభకోణాన్ని ‘సాక్షి’ ఇప్పటికే బట్టబయలు చేయడం తెలిసిందే. అయితే అసైన్డ్ రైతులే కాకుండా అమరావతిలోని ప్రభుత్వ భూములను సైతం తమ బినామీల పేరిట నమోదు చేసి చంద్రబాబు బృందం భూదోపిడీకి పాల్పడటం ‘సాక్షి’ పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా 328 ఎకరాల ప్రభుత్వ భూమిని 522 మంది బినామీల పేరిట హస్తగతం చేసుకున్నారు. అనంతరం భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.760.25 కోట్లను కాజేశారు. చంద్రబాబు, నారాయణ, లోకేశ్ అసైన్డ్ భూ దోపిడీలో ఆ అవినీతి పర్వం ఇదిగో ఇలా ఉంది.... రెండు కేటగిరీలుగా వర్గీకరించి.. రాజధాని పేరుతో అమరావతి పరిధిలో సర్వే చేయించిన చంద్రబాబు, నారాయణ దృష్టి ఆ ప్రాంతంలోని ప్రభుత్వ భూములపై పడింది. అసైన్డ్ భూములను 1 నుంచి 4 కేటగిరీల కింద విభజించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి తీసుకోగా ఎవరి ఆధీనంలోనూ లేని ప్రభుత్వ భూములను దక్కించుకునేందుకు మరో పన్నాగం పన్నారు. ఆ ప్రభుత్వ భూములన్నీ గుర్తు తెలియని రైతుల ఆధీనంలో ఉన్నట్లు రికార్డుల్లో చూపించారు. వాటిని అసైన్డ్ భూముల జాబితాలో 5, 6 కేటగిరీల కింద పేర్కొన్నారు. అన్యాక్రాంతమైనప్పటికీ అభ్యంతరాలు లేని భూములను కేటగిరీ 5 కింద, అన్యాక్రాంతమై అభ్యంతరాలున్న భూములను కేటగిరీ 6 కింద చూపిస్తూ జీవో 41 జారీ చేశారు. ఆ భూములకు భూసమీకరణ ప్యాకేజీని ప్రకటించారు. కేటగిరీ 5 కింద భూములకు 500 చ.గజాల నివాస స్థలం, 100 చ.గజాల వాణిజ్య స్థలాన్ని ప్యాకేజీగా పేర్కొన్నారు. కేటగిరీ 6 కింద భూములకు 260 చ.గజాల నివాస స్థలాన్ని ప్యాకేజీగా ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు ఎకరా కంటే తక్కువ ఉన్న భూములకు కూడా కనీసం ఎకరా ప్యాకేజీ వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు. 328 ఎకరాలు... రూ.760.25 కోట్ల ప్యాకేజీ అనంతరం అసలు కథను తెరపైకి తెచ్చారు. అమరావతి పరిధిలో కేటగిరీ 5 కింద 237.60 ఎకరాలను గుర్తించారు. ఆ భూములన్నీ 295 మంది ఆధీనంలో ఉన్నట్టుగా చూపించారు. ఇక కేటగిరీ 6 కింద 90.52 ఎకరాలను చూపించారు. ఆ భూములు 227 మంది స్వాధీనంలో ఉన్నట్టుగా కనికట్టు చేశారు. వాస్తవానికి ఆ రెండు కేటగిరీల భూములు ఎవరి ఆధీనంలోనూ లేవు. కానీ ఆ భూములు 522 మంది తమ బినామీల ఆధీనంలో ఉన్నట్టుగా చూపించి భూసమీకరణ ప్యాకేజీని కొల్లగొట్టారు. అమరావతిలో ప్యాకేజీ ప్రకటించే నాటికి నివాస స్థలం చ.గజం రూ.30 వేలు, వాణిజ్య స్థలం చ.గజం రూ.50 వేలు చొప్పున మార్కెట్ ధర పలికింది. అమరావతి నిర్మాణం పూర్తయితే మార్కెట్ ధర మరింత పెరుగుతుంది. అప్పటి ధరనే తీసుకుంటే కేటగిరీ 5 కింద ఒక్కొక్కరికీ రూ.1.50 కోట్ల విలువైన నివాస స్థలం, రూ.50 లక్షలు విలువైన వాణిజ్య స్థలం వెరసి రూ.2 కోట్లు చొప్పున ప్యాకేజీ దక్కింది. ఆ ప్రకారం కేటగిరీ 5 కింద ఉన్న 295 మంది రూ.590 కోట్ల విలువైన స్థలాలను పొందారు. కేటగిరీ 6 కింద ఒక్కొక్కరికీ రూ.75 లక్షలు విలువైన నివాస స్థలం ఇచ్చారు. ఆ ప్రకారం 227 మందికి రూ.170.25 కోట్ల విలువైన స్థలాలు దక్కాయి. మొత్తం మీద కేటగిరీ 5, 6లలో రైతులుగా చూపించిన తమ బినామీలు 522 మంది ముసుగులో చంద్రబాబు, నారాయణ రూ.760.25 కోట్ల విలువైన స్థలాలను కొల్లగొట్టినట్లు స్పష్టమైంది. ఆ గ్రామాల్లో ఒక్కరూ లేరు అమరావతి భూదోపిడీపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తులో అసైన్డ్ భూకుంభకోణం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ కార్యాలయాల్లో ఉన్న భూముల రికార్డులు, సీఆర్డీయే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించిన రైతుల జాబితాలను సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేటగిరీ 5, 6లలో చూపించిన 522 మంది రైతుల్లో ఒక్కరు కూడా అమరావతి గ్రామాల్లోనే లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించిన రైతులెవరూ లేరు. భూసమీకరణ ప్యాకేజీ కింద రాజధానిలో అత్యంత విలువైన స్థలాలను కాజేసేందుకే చంద్రబాబు ముఠా ఈ పన్నాగానికి పాల్పడిందన్నది ఆధారాలతోసహా నిర్ధారణ అయ్యింది. -
'3 నెలల్లో భూ సమీకరణ పూర్తిచేస్తాం'
మచిలీపట్నం: పోర్టులు, టూరిజం ద్వారానే సింగపూర్ అభివృద్ధి చెందిందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్లో మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) కార్యాలయాన్ని శనివారం మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని అమరావతి తరహాలోనే మచిలీపట్నంలో పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం 33,177 ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు చెప్పారు. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎంఏడీఏ కార్యాలయం ప్రారంభించిన రోజే భూసమీకరణ 1370 ఎకరాలను రైతులను ప్రభుత్వానికి అప్పగించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో 14 పోర్టులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. మొదటి ప్రాధాన్యత మచిలీపట్నం పోర్టుకు ఇస్తున్నారన్నారు. సింగపూర్ 720 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఉందన్నారు. పోర్టుల ద్వారా సరుకులు ఎగుమతులు, దిగుమతులు చేస్తూ అభివృద్ధి చెందిన దేశంగా పేరొందిందన్నారు. జపాన్ జనభా 13 కోట్లు ఉండగా అక్కడ 1020 పోర్టులు ఉన్నాయన్నారు. వీటిలో 106 మేజర్ పోర్టులు, 22 స్పెషల్ మేజర్ పోర్టులు, చైనాలో 2వేల పోర్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కారణంతోనే ఆ దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ పట్టిసీమను నిర్మిస్తుంటే కొందరు అడ్డుకున్నారని, పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం భూసమీకరణ చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు అడ్డుకుంటున్నారని అయినా పోర్టు నిర్మించి తీరుతామని అన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణాన్ని అడ్డుకోకుండా తమకు సహకరించాలని కోరారు. శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, ఎమ్మెల్సీ పీతా రవిచంద్ర, ఇన్చార్జ్ కలెక్టర్ గంధం చంద్రుడు, మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
నారాయణ లాస్ట్.. పీతల ఫస్ట్
విజయవాడ: పనితీరును, అభివృద్ధి పనులపై అందించిన సమాచారాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. కీలకమైన రాజధాని భూసేకరణ, నిర్మాణ ఒప్పందాలు తదితర వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణకు సీఎం చిట్టచివరి ర్యాంకు కేటాయించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతకు మొదటి ర్యాంక్ దక్కింది. సోమవారం విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో సీఎం ఆయా మంత్రులకు ఏయే ర్యాంకులు లభించాయో వెల్లడించినట్లు తెలిసింది. ఇతర మంత్రుల ర్యాంకులు ఈ విధంగా ఉన్నాయి.. దేవినేని ఉమ- 2, పత్తిపాటి పుల్లారావు- 3, కామినేని శ్రీనివాసరావు- 4, పరిటాల సునీత- 5, రావెల కిశోర్ బాబు- 6, అచ్చెన్నాయుడు- 7, గంటా శ్రీనివాసరావు- 8, కొల్లు రవీంద్ర- 9, అయ్యన్నపాత్రుడు- 10, పల్లె రఘునాథరెడ్డి- 11, మృణాళిని 13, పి. నారాయణ- 18వ ర్యాంకు పొందారు. గత ఆగస్టులోనూ ప్రభుత్వ పథకాల అమలు ప్రామాణికంగా టీడీపీ అధినేత మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నాటి ర్యాంకుల్లో సీఎం చంద్రబాబుకు అనూహ్యంగా రాష్ట్రంలో 9వ ర్యాంక్ దక్కింది. -
'రౌడీలా మాట్లాడుతున్నాడు'
హైదరాబాద్ : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రౌడీలా మాట్లాడుతూ కాపు ఉద్యమాన్ని భ్రష్టుపట్టిస్తున్నడాని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లో పి.నారాయణ విలేకరులతో మాట్లాడుతూ... మూడు నిమిషాల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోస్తానంటూ ముద్రగడ రౌడిలా మాట్లాడుతున్నరని విమర్శించారు. కాపులను అంతర్జాతీయ స్థాయిలో అప్రతిష్టపాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాపులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందని నారాయణ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్లు చంద్రబాబు ప్రభుత్వం నడవదంటూ ముద్రగడను ఎద్దేవా చేశారు. రాజధాని భూముల గురించి ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారని ముద్రగడను మంత్రి నారాయణ ప్రశ్నించారు. రాజ్యసభ పదవికి ఆశపడి కాపు ఉద్యమాన్ని పక్కదోవపట్టిస్తున్నారని ముద్రగడపై నిప్పులు చెరిగారు. -
త్వరలో సీఎం వద్దకు పంచాయితీ
స్ట్రాంవాటర్ డ్రెయినేజ్ పనులు పబ్లిక్ హెల్త్ విభాగానికి కట్టబెట్టిన మంత్రి నారాయణ! కార్పొరేషన్కే అప్పగించాలంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలు విజయవాడ : స్ట్రాం వాటర్ డ్రెయినేజ్ (వరద నీరు) నిధులు తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపుతున్నాయి. ఎట్టకేలకు నిధుల్ని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పనుల్ని పబ్లిక్ హెల్త్ విభాగానికి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. మున్సిపల్ మంత్రి పి.నారాయణ ఒత్తిడి వల్లే పబ్లిక్ హెల్త్ విభాగానికి పనుల్ని కట్టబెడుతున్నట్లు సమాచారం. నగరపాలక సంస్థ చేపట్టాల్సిన పనుల్ని పబ్లిక్ హెల్త్ విభాగానికి అప్పగించడంపై స్థానిక ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. ఎంపీ కేశినేని నాని, తూర్పు, సెంట్రల్ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, మేయర్ కోనేరు శ్రీధర్ ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. రాకరాక వచ్చిన నిధులు టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య కుమ్ములాటలకు దారితీయడం ఇప్పుడు కార్పొరేషన్లో హాట్ టాపిక్గా మారింది. చిన్నబుచ్చుకున్నారు స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మేలో రూ.461 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. తొలివిడతగా రూ.110 కోట్లను విడుదల చేసింది. రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని తొక్కిపట్టింది. నిబంధనల నేపథ్యంలో ఎట్టకేలకు ఇటీవలే విడుదల చేసింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఎంపీ నాని, మేయర్ శ్రీధర్ చొరవ చూపారు. ఏ దశలోనూ కృషి చేయని మంత్రి నారాయణ ఇప్పుడు పెత్తనం చేయడాన్ని స్థానికనేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులు డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను ఇంజినీరింగ్ అధికారులు రూపొందించారు. 100 కి.మీ మేర పెద్ద డ్రెయిన్లు, 38 కి.మీ మేర చిన్న డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని గుర్తించారు. గుంటుతిప్ప, ప్రసాదంపాడు, పుల్లేరు డ్రెయిన్ల వద్ద రోడ్లు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పుడు పనుల్ని పబ్లిక్హెల్త్ విభాగానికి అప్పగించడంతో కార్పొరేషన్ అధికారులు చిన్నబుచ్చుకున్నారు. ఎందుకంత ప్రేమ! రూ.62 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించిన నగరంలో వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. గంటల కొద్దీ నీరు రోడ్లపై నిలవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నగరంలోని 13 డివిజన్ల పరిధిలో 161 ఎకరాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. వీటిపై 40 వేల కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నాయి. వర్షం వచ్చిన సమయంలో కొండ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ధాటికి రోడ్లు అతలాకుతలం అవుతున్నాయి. మురుగునీటి డ్రెయిన్లద్వారానే వర్షపునీరు ప్రవహించాల్సి వస్తోంది. దీనికి ఆ డ్రెయిన్ల సామర్థ్యం చాలక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వన్టౌన్, సర్కిల్-3లోని పలు ప్రాంతాల్లో ఈ సమస్యలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈక్రమంలో స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిర్మాణం పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంది. పబ్లిక్హెల్త్ విభాగంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ ఒకరు, ఒక డీఈ, ఇద్దరు ఏఈలు మాత్రమే ఉన్నారు. ఎస్ఈ గుంటూరు జిల్లాలో ఉంటారు. నగరపాలక సంస్థలో చీఫ్ ఇంజినీర్, ఇద్దరు ఎస్ఈలు, 8 మంది ఈఈలు, 21మంది డీఈలు, 40 మంది ఏఈలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంతమంది అధికారులు కార్పొరేషన్లో ఉండగా పబ్లిక్హెల్త్ విభాగానికి పనుల బాధ్యతల్ని మంత్రి అప్పగించడం అనుమానాలకు తావిస్తోంది. అనుమానమే.. కేంద్రం నిధులతో చేపట్టబోయే పనుల్ని మూడేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకుంటే నిధులు మురిగిపోతాయి. ప్రతి ఆరునెలలకు ఓ సారి నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపాల్సి ఉంటుంది. నిధుల వినియోగంలో తేడా ఉంటే కంట్రోలర్ ఆఫ్ ఆడిట్ జనరల్ (కాగ్) తప్పుబట్టే అవకాశం ఉంది. పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో సకాలంలో పనులు పూర్తవుతాయనే నమ్మకం తమకు లేదన్నది స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయంగా తెలుస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement