నృసింహాలయంలో పోటెత్తిన భక్తజనం

19 Aug, 2017 21:56 IST|Sakshi
నృసింహాలయంలో పోటెత్తిన భక్తజనం

కదిరి: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో పోటెత్తింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా భక్తులు తమ ఇలవేల్పు దేవుడు నారసింహుని దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ఈసారి భక్తుల సంఖ్య బాగా పెరిగిందని ఆలయ సహాయ కమిషనర్‌ వెంకటేశ్వరరెడ్డి తెలియజేశారు. జిల్లా వాసులతో పాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు విచ్చేశారు. ఆలయ ప్రాంగణం ‘ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవిందా..’ అనే నామస్మరణతో మార్మోగింది.

మరిన్ని వార్తలు