విద్యార్ధిని అదృశ్యం.. లెక్చరర్ పై ఆరోపణలు

5 Nov, 2016 13:42 IST|Sakshi

జగిత్యాల: జిల్లాలోని వెల్లటూరు గ్రామంలో ఓ ప్రైవేట్ కళాశాలపై విద్యార్ధిని తల్లిదండ్రులు దాడి చేశారు. ఈ ఘటనలో కళాశాల ఫర్నీచర్ ధ్వంసమైంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హర్ష శ్రీ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న తమ కూతురు అదృశ్యమవడానికి అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

కాగా, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(20) మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. ప్రేమ పేరుతో ఉపాధ్యాయుడు రాజ్ కుమార్ తమ కూతుర్ని వేధింపులకు గురి చేశాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో అదృశ్యం చేశాడని అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు