కేసీఆర్‌ అబద్ధాలకోరు

29 Dec, 2016 03:00 IST|Sakshi
కేసీఆర్‌ అబద్ధాలకోరు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

మల్యాల: కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తా మంటూ ఇచ్చిన హామీని తుంగలో తొక్కడంతోపాటు అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్‌ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మహాజన పాదయాత్ర జగిత్యాల జిల్లా మల్యాలలో సాగింది.

ఈ సందర్భం గా తమ్మినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లో ఉండి రాష్ట్రమంతా సుభిక్షంగా ఉందంటున్నారని, కానీ తండాలు, దళిత వాడలకు వచ్చి మాట్లాడితే వాస్తవ పరిస్థితి తెలుస్తుందన్నారు. గతంలో తెలంగాణ సెంటిమెంట్‌తోనే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవడం వట్టిమాటేనని జోస్యం చెప్పారు. అట్టడుగు వర్గాల నాయకులు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు