చంద్రగిరిలో టీడీపీ నేతల దాదాగిరి

12 Oct, 2016 16:21 IST|Sakshi

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. అధికార మదంతో దాదాగిరి చెలాయిస్తున్నారు. చంద్రగిరి మూలస్థానమ్మ ఆలయ ఈవోపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు.

ఈవోపై టీడీపీ నాయకులు గౌస్ భాషా, భాస్కర్ చేయి చేసుకున్నారు. దాడి ఘటనను చిత్రీకరిస్తున్న భక్తులపై వీరంగమాడారు. టీడీపీ నేతల తీరుపై ఆలయ ఉద్యోగులు, భక్తులు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు