నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

21 Oct, 2016 01:00 IST|Sakshi

 సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం శుక్రవారం జరగనుంది. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణలోని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరుకానున్నారు. నవంబర్ 1 నుంచి చేపట్టనున్న జనచైతన్యయాత్రలు, సభ్యత్వ నమోదుపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అలాగే ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే జిల్లాస్థాయి విసృ్తత సమావేశాలతో పాటు 26, 27 తేదీల్లో జరిగే నియోజకవర్గ సమావేశాలకు పంపించాల్సిన పరిశీలకుల జాబితాపై కూడా చర్చించనున్నారు.
 

>
మరిన్ని వార్తలు