లబ్ధిదారుల ఎంపికలో టీడీపీ పెత్తనం

20 Aug, 2017 03:33 IST|Sakshi
లబ్ధిదారుల ఎంపికలో టీడీపీ పెత్తనం

శ్రీకాళహస్తి రూరల్‌: మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి కల్పనలో భాగంగా నిరుద్యోగులకు రుణాల మంజూ రు కోసం లబ్ధిదారుల ఎంపికలో టీడీపీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. రెండు రోజులుగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూ లు జరుగుతున్నాయి.

శనివారం తొండమాన్‌పురం సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ పరిధిలో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు ఇంటర్వ్యూ లు నిర్వహించారు. టీడీపీకి చెందిన నాయకులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారి పక్కనే కూర్చోని, తమకు కావాల్సిన వారిని ఎంపిక చేయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంటర్వ్యూలు నిర్వహించేటప్పుడు ప్రజాప్రతినిధులకు అక్కడ పనేమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించేట ప్పుడు సెలెక్షన్‌ కమిటీ సభ్యులు ఉండవచ్చని ఇన్‌చార్జి ఎంపీడీఓ మహ్మద్‌ రఫీ తెలిపారు.

మరిన్ని వార్తలు