ఖమ్మం క్రైం : మాంసం తెచ్చిన వివాదంలో త్రీటౌన్ పోలీసులు గురువారం ఇద్దరిపై కేసు నమోదు చేశారు. రైటర్ చంద్రనాగ్ కథనం ప్రకారం.. వ్యవసాయ మార్కెట్కు సెలవు కావడంతో కొందరు హమాలీలు ముత్యాలమ్మ పండగ నిర్వహించారు. ఇందులో భాగంగా మేకను కోశారు. మాంసం పంచుకునే సమయంలో హమాలీల మధ్య వివాదం తలెత్తింది. దీంతో వాసు, చలమయ్య అనే హమాలీలు.. మరో హమాలీ కత్తిమళ్ల సురేష్పై దాడి చేశారు. దీంతో బాధితుడు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై ఇంద్రసేనారెడ్డి వీరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.