10లోపు పండిట్‌ కోర్సు పరీక్ష ఫీజు చెల్లించాలి

1 Jul, 2017 23:19 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ :

భాషాపండిట్‌ కోర్సు (టీపీటీ, హెచ్‌పీటీ) పరీక్షలకు సంబంధించి రెగ్యులర్, ప్రైవేట్‌ విద్యార్థులు ఈనెల 10లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కళాశాలల ప్రధానోపాధ్యాయులు 11న ట్రెజరీ లేదా బ్యాంకులో చెల్లించాలన్నారు. రూ. 50 అపరాధ రుసుంతో ఈనెల 17 వరకు ఫీజు చెల్లించొచ్చని, ప్రధానోపాధ్యాయులు 18న బ్యాంకులో చెల్లించాలన్నారు. నామినల్‌ రోల్స్, దరఖాస్తులను ఈనెల 21న పంపాలన్నారు. మూడు సబ్జెక్టులకు రూ. 100, ఆపైన సబ్జెక్టులకు రూ.150 చలానా రూపంలో  చెల్లించాలని స్పష్టం చేశారు. వివరాలకు ఠీఠీఠీ.bట్ఛ్చp.ౌటజ వెబ్‌సైట్‌ను పరిశీలించాలన్నారు. 

మరిన్ని వార్తలు