హుజూర్నగర్ : పట్టణంలోని వాసవీ భవన్లో ఆదివారం ఆవోపా ఆధ్వర్యంలో ఆర్యవైశ్య విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యలో రాణిస్తున్న పలువురు విద్యార్థులకు ప్రోత్సహకాలు, నోటుపుస్తకాలు, పెన్నులు, డ్రస్లతో పాటు నిరుపేద ఆర్యవైశ్య మహిళలకు పింఛన్లను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంది స్వరాజ్యబాబు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆవోపా పట్టణ అధ్యక్షుడు వంగవీటి హనుమంతరావు, తహసీల్దార్ శ్రీదేవి, రాష్ట్ర ఆవోపా ఉపాధ్యక్షులు సామా నారాయణ, నాగేశ్వరరావు, కృష్ణమూర్తి, బూర్లె లక్ష్మీనారాయణ, గుండా భద్రయ్య, గెల్లి అప్పారావు, రామ్మోహన్రావు, ప్రభాకర్రావు, శ్రీనివాసరావు, ఆనంద్, మల్లికార్జున్రావు, పి.శ్రీనివాస్, కె.రామారావు, పి.వెంకటేశ్వర్లు, వి.న రేష్ పాల్గొన్నారు.